Friday, October 1, 2010
ఈ తప్పు ఎవరిది ?
నిన్న ఆఫీసు నుంచి తొందరగా వచ్చేసా, ఎందుకని అడగరే! అదే నండి అయోధ్య తీర్పు అని అన్నీ మూసివేసారు. సరే అని ఇంటికి వచ్చి న్యూస్ చానెల్ పెట్టాను, ఎప్పుడు లేని ప్రకటనలు, ఏమిటని అడగరె,అన్నీ దేశ భక్తి ప్రకటనలే.
దేశమంటే మట్టికాదోయ్ ! దేశమంటే మతంకాదోయ్ !! దేశమంటే మనుషులోయ్ !!!
అంటే దేశంలో ఎదో ఒక గడబిడ జరిగితేనే కాని మన వాళ్ళకి ఈ దేశం గుర్తుకు రాదు అనేగా.
ఏ ఇవే ప్రకటనలు రోజూ వేయచ్చుగా, వేయరు ఎందుకంటే వీటికి ఎవరు డబ్బులు ఇవ్వరు గనక అంతేగ. నిన్న అరఘంటలో సుమారు 5 సార్లు వేశారు, కనీసం మిగతా రోజుల్లో రోజుకి 10 సార్లు వేశిన చాలు, కాని అది కూడ చేయరు.ఇది మీడియా తప్పా లేక ప్రభుత్వం యొక్క పొరపాట.
ఎవరిని నిందించాలి ? దీనికి భాధ్యులు ఎవరు?
Subscribe to:
Posts (Atom)